Exam Pass : జైశ్రీరామ్ అని రాస్తే పరీక్షలో పాస్ చేశారు!

Exam Pass : జైశ్రీరామ్ అని రాస్తే పరీక్షలో పాస్ చేశారు!

డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్’ నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్‌సింగ్ పుర్వాంచల్ వర్సిటీలో జరిగింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఇద్దరు ప్రొఫెసర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆన్సర్ షీట్లో రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ వంటి క్రికెటర్ల పేర్లను స్టూడెంట్స్ రాసినట్లు సమాచారం. ఆర్టీఐ చట్టం కింద కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

యూనివర్సిటీ ప్రొఫెసర్ల బాగోతం గురించి దివ్యాన్షూ సింగ్ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యూనివర్సిటీ వీసీకి కూడా లేఖ రాశాడు. ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది కుమ్మక్కై సున్నా మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారని ఆరోపించాడు. ఈ ఉదంతంపై స్పందించిన యూనివర్సిటీ వీసీ వందన సింగ్..ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయాన్ని కమిటీ తన రిపోర్టులో పేర్కొందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story