దేశంలో గణనీయంగా కరోనా రికవరీ రేటు
By - Admin |23 Aug 2020 3:47 PM GMT
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల ప్రతీరోజు సుమారు డెబ్బైవేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల ప్రతీరోజు సుమారు డెబ్బైవేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా రికవరీ రేటు మాత్రం గణనీయంగా నమోదవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 75శాతానికి చేరువలో ఉందిన పేర్కొందని గడిచిన 24 గంటల్లో 57,989 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం భారత్ లో 22,80,566 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 7,07,668 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com