ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

X
By - Admin |23 Aug 2020 9:20 PM IST
ఏపీలో ఇటీవల ప్రతీరోజు సుమారు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవ్వగా.. ఆదివారం కాస్తా తగ్గుముఖం పట్టాయి.
ఏపీలో ఇటీవల ప్రతీరోజు సుమారు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవ్వగా.. ఆదివారం కాస్తా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,53,111కు చేరింది. అయితే, ఇప్పటివరకు 2,60,087 మంది కరోనా నుంచి రికవరీ అవ్వగా.. ఇంకా 89,742 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 93 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 3,282 చేరాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com