India : భారత్ నుంచి 16 మంది విదేశీయుల బహిష్కరణ

X
By - Manikanta |11 Feb 2025 4:45 PM IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటు న్న 16 మందిని అధికారులు గుర్తించారు. ద్వారకా ప్రాంతంలో మకాం వేసిన వీరిలో ఐదుగురుని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించింది. తొమ్మిది మంది నైజీరియన్లు, గినియా, ఉజ్బెకిస్తాన్ కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచిస్వదేశాలకు పంపించినట్లు పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com