Iran-Israel : ఇరాన్ - ఇజ్రాయెల్ నుంచి 40 మంది తెలుగు ప్రజల రాక

X
By - Manikanta |25 Jun 2025 12:15 PM IST
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వస్థలాలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు చేర్చుతున్నారు. ఆ రెండు దేశాల్లో చిక్కుకున్న 40 మంది తెలుగు ప్రజలు మంగళవారం ఢిల్లీకి వచ్చారు. వారిని ఆంధ్రప్రదేశ్లోని సొంతూర్లకు చేరేలా ఏపీ భవన్ అధికారులు పర్యావేక్షించారు. ఇందులో ఇరాన్ నుంచి 35 మంది, ఇజ్రాయెల్ నుంచి 24 మంది ఉన్నారు. 28 మంది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సొంతూరుకు వెళ్లి పోయారు. 9 మంది టీసీఎస్ ఉద్యోగులు కూడా స్వదేశానికి చేరుకున్నారు. 22 మంది మాత్రం ఢిల్లీ చేరుకున్న తర్వాత ఏపీ భవన్ లో స్టే చేసినట్లుగా వెల్లడించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com