Dengue Cases : ఈ ఏడాది 9,000 డెంగ్యూ కేసులు, 7 మరణాలు

X
By - Manikanta |15 July 2024 11:46 AM IST
ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు కర్ణాటకలో 9 వేల డెంగ్యూ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. జులై 13 వరకు 66 వేల 298 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా, అందులో మొత్తం 9 వేల 82 మందికి జ్వరం పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 2 వేల 557 మందికి డెంగ్యూ కోసం నమూనాలను పరీక్షించగా, వారిలో 424 మంది పాజిటివ్గా తేలింది. జూలై 13 నాటికి 18 ఏళ్లు పైబడిన 5 వేల 725 మంది పెద్దలు డెంగ్యూ పాజిటివ్ గా తేలారు. వీరితో పాటు 1 నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల 3 వేల 203 మంది పిల్లలు, ఒక సంవత్సరం లోపు 154 మంది శిశువులు ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com