Ayodhya MP : బోరున ఏడ్చిన అయోధ్య ఎంపీ అవధేశ్

Ayodhya MP : బోరున ఏడ్చిన అయోధ్య ఎంపీ అవధేశ్
X

అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్ మీడియా ముందు ఏడ్చేశారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ యువతి ఇటీవల కనిపించకుండా పోయింది. ఆమె మృతదేహం అత్యంత దయనీయ స్థితిలో దొరికింది. ఈ నేపథ్యంలో ఎంపీ ఆవేదనకు లోనయ్యా రు. యువతి అదృశ్యమై మూడు రోజులైనా ఆమెను కాపాడలేక పోయామని విలపించారు. చివరికి ఆ యువతి దారుణంగా హత్యాచారానికి గురయినట్లు పేర్కొంటూ బోరున ఏడ్చేశారు. ఈ విషయంపై ప్రధాని మోడీతో మాట్లాడతానని, యువతిని కాపాడలేనందున పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పక్కనే ఉన్న పార్టీ నేతలు ఆయనను సముదాయించారు. మృతురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయడానికి పోరాటం చేయాలని సూచించారు. గురువారం రాత్రి కనిపించ.. కుండా పోయిన యువతి చివరకు గ్రామానికి కొంత దూరంలోని కాలువలో శవమై తేలింది. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టివేయబడి, వివస్త్రగా ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story