Ayodhya : అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత

Ayodhya : అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత
X

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్ర దాస్ డయాబెటిస్, హై బీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచే ఈయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.

వృద్ధ్యాప్యం వల్ల సంభవించిన అనారోగ్య కారణాలతో ఈ నెల 3వ తేదీన ఆచార్య సత్యేంద్రనాథ్ లక్నో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తొలి రెండు రోజుల పాటు ఆరోగ్యం విషమంగానే కనిపించింది. దీనితో న్యూరాలజీ విభాగానికి తరలించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందజేశారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు.

ఆచార్య సత్యేంద్ర దాస్ మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ‘‘శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీ అయోధ్య ధామ్ ప్రధాన పూజారి, రాముని పరమ భక్తులు ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ జీ మహారాజ్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. వినయపూర్వకమైన నివాళి!. ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించమని, మరణించిన సాధువుకు ఆయన పాదాల చెంత చోటు కల్పించాలని భగవంతుడు శ్రీరామున్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి!’’ అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

Tags

Next Story