BJP : తప్పుకునేందుకు సిద్ధం.. బీజేపీకి సీఎం సిద్ధరామయ్య సవాల్

BJP : తప్పుకునేందుకు సిద్ధం.. బీజేపీకి సీఎం సిద్ధరామయ్య సవాల్

తనపై బీజేపీ (BJP) సహా ప్రతిపక్షాలు చేస్తున్న లంచం ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని హాట్ కామెంట్ చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramayya). 2013-2018లో అయినా.. ప్రస్తుత ప్రభుత్వ సమయంలో ఎవరైనా తనకు ఐదు పైసలైనా లంచం ఇచ్చినట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్ధరామయ్య బీజేపీకి సవాల్ చేశారు. సోమవారం ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కాంట్రాక్టర్ల సదస్సును ప్రారంభించిన సందర్భంగా.. ఈ హాట్ కామెంట్స్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కాంట్రాక్టర్ల డబ్బును దశలవారీగా చెల్లిస్తామని సిద్ధరామయ్య అని చెప్పారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి 40 శాతం కమీషన్ అడిగారని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న ఆరోపించడంతో రచ్చ మొదలైంది. బీజేపీ.. సీఎం సిద్ధరామయ్యను, కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. అయితే ఆ తర్వాత కెంపన్న ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకున్నారు. ఐతే.. ఈ వివాదం మాత్రం ముదిరింది. సీఎం, డిప్యూటీ సీఎంలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కాంట్రాక్టర్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని డిప్యూటీ సీఎం శివకుమార్ కోరారు. కాంట్రాక్టర్ల సదస్సులో మాట్లాడిన డీకే.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గుత్తేదారులు మాత్రం రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలన్నారు. వచ్చే 9 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని, కాంట్రాక్టర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. అధికార పార్టీ, కాంట్రాక్టర్లు జోడెద్దుల్లా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. మరియు మీరు దేశ నిర్మాణ వ్యాయామంలో భాగం" అని ఆయన అన్నారు. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకా ఇలా అన్నారు: "మేము ఈ సంవత్సరం అభివృద్ధి పనుల కోసం సుమారు 1.20 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాము. 3.71 లక్షల కోట్ల బడ్జెట్‌లో దాదాపు రూ.50,000 కోట్లు హామీ పథకాలకే వెళ్తాయి. కాంట్రాక్టర్లు వాటిని అమలు చేసేందుకు వీలుగా మేము అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేశాము'' అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story