లాభార్జనలో బీజేపీ ముందంజ.. తర్వాత కాంగ్రెస్

లాభార్జనలో బీజేపీ ముందంజ.. తర్వాత కాంగ్రెస్

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2360.84 కోట్లతో జాతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) రెండవ అత్యధిక ఆదాయం రూ. 452.37 కోట్లుగా ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ₹ 141.66 కోట్లుగా ఉంది.

ADR ద్వారా విశ్లేషణ ప్రకారం, (BJP, INC, CPI(M), ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, NPEP) సహా ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 3,076.88 కోట్లు, ఇందులో BJP వాటా 76.73%. INC మొత్తం ఆదాయంలో 14.70% రెండవ అత్యధికంగా ఉండగా, NPEP అత్యల్ప ఆదాయం రూ. 7.562 కోట్లుగా ప్రకటించింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని జాతీయ పార్టీలు భారతదేశం అంతటా చేసిన మొత్తం ఆదాయం, ఖర్చులను ఈ నివేదిక విశ్లేషిస్తుంది. పార్టీలు ECIకి సమర్పించిన వార్షిక ఆడిట్ ను ఈ నివేదికలో ప్రకటించాయి. BJP మొత్తం ఆదాయంలో ( రూ. 2360.84) 57.68% ( రూ. 1361.68 కోట్లు) మాత్రమే ఖర్చు చేసింది. బీజేపీ ఆదాయంలో దాదాపు 89.80% స్వచ్ఛంద విరాళాల నుంచి వచ్చినవేనని నివేదిక పేర్కొంది.

Tags

Next Story