BJP : గోవాలో తొలిసారిగా మహిళకు బీజేపీ టికెట్

BJP : గోవాలో తొలిసారిగా మహిళకు బీజేపీ టికెట్

గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్.. గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు.

కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో స‌ర్దిన్హా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిండం విశేషం.

పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ప‌ట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు.

ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story