Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్.. 20 మంది గల్లంతు

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్.. 20 మంది గల్లంతు
X

హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్బ్ సంభ వించింది. ఫలితంగా ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా కురిసిన కుంభవృ ష్టి కారణంగా వచ్చిన వరదలతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో 20 మంది గల్లంతయ్యారు. కాంగ్రా జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సమీపంలోని లేబర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో అక్కడి కార్మికులు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు చెప్పిన అధికారులు.. మానునీ ఖేడ్ సహా ఇరత సమీపంలోని కాలువల నుంచి వరద నీరు లేబర్ కాలనీలోకి రాకుండా మళ్లించినట్లు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగంతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ ఘటనలో 20 మంది కా ర్మికులు గల్లంతైనట్లు ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కుల్లు జిల్లా లోని మూడు ప్రాంతాల్లో క్టాడ్బర్స్ ఘటనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story