Congress : బీజేపీ గెలిస్తే ఎన్నికలే రావు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

Congress : బీజేపీ గెలిస్తే ఎన్నికలే రావు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

ఎన్నికలు దగ్గర పడుతుండటం.. కోర్టు తీర్పులు, పార్టీల అకౌంట్లపై ఐటీ శాఖ నజర్ తో... (BJP) బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. కేసుల ఉచ్చులో పడి వణికిపోతున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.

పార్టీ బ్యాంక్ ఖాతాలు నిలిపివేత రాజకీయంగా సంచలనం రేపుతోంది. పార్టీ అకౌంట్లో డబ్బులున్నా వాడుకోలేని స్థితి కల్పించిన ఐటీ శాఖ.. ఆ తర్వాత ఊరట కల్పించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ (Congress) నిరసన కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి చివరి రోజులు వచ్చేశాయని మరోసారి బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలే రావని తేల్చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.

కాంగ్రెస్ పార్టీ రూ. 210 కోట్ల ఆదాయపు పన్ను కట్టాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీస్ ఇచ్చింది. 2018-19కి సబంధించిన రిటర్న్స్ ను కాంగ్రెస్ ఆలస్యంగా దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు, ఎంపీలు తమ వేతనాల నుంచి విరాళాలుగా పార్టీకి ఇచ్చిన రూ. 14.4 కోట్ల నగదు రసీదులలో లోపాలున్నాయని ఐటీ శాఖ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ రూ. 210 కోట్ల ఆదాయపు పన్ను కట్టాలని నోటీసులో సూచించింది. ఖాతాలను స్తంభింపచేసింది. ఐతే.. అప్పిలేట్ ట్రిబ్యునల్ లో కాంగ్రెస్ ఊరట దక్కించుకుంది. ఐతే.. రూ. 115 కోట్లు పరిమితి విధించింది. ఖాతాల్లో ఆ మొత్తం ఉంచి..ఆ పైన ఉన్న నగదును మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచించింది.

ఎలక్టోరల్‌ బాండ్‌ స్కాంతో రూ. 6,500 కోట్లు చెక్కు చెదరకుండా బీజేపీ అకౌంట్‌ లో మిగిలిపోయాయని కాంగ్రెస్ అంటోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్‌ బాండ్లను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత బీజేపీ ఖాతాలను ఐటీ సీజ్‌ చేయాల్సి ఉందని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇందులో 95 శాతానికి పైగా నిధుల్ని బీజేపీ జేబులో వేసుకుందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story