Terror Attack : ప్రమాణం రోజే టెర్రర్ ఎటాక్.. కాంగ్రెస్ ఆరోపణ

Terror Attack : ప్రమాణం రోజే టెర్రర్ ఎటాక్.. కాంగ్రెస్ ఆరోపణ

మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు బరితెగించారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

బస్సు శివఖోడా ఆలయం నుంచి కర్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. రాజౌరీ, పూంచ్, రియాన్ ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడు వారాలుగా జమ్ముకశ్మీర్ లో దాడులు జరుగుతున్నాయని.. ప్రజల భద్రతపై ఎన్డీయే చెప్పిందంతా డొల్ల ప్రొపగాండా అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇది సిగ్గుచేటైన చర్య అని.. దేశం ఒక్కటిగా నిలబడి ఖండిస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ.

Tags

Next Story