Bhole Baba : తొక్కిసలాట వెనుక కుట్ర.. భోలే బాబా లాయర్ వివరణ

ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో కుట్ర జరి గిందని భోలే బాబా తరుపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. సుమారు 15 మంది వ్యక్తులు విషం చల్లి తొక్కిసలాటను ప్రేరేపించి పారిపోయారని ఆరోపించారు. జూలై 2న భోలే బాబా సత్సంగం కార్యక్ర మంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది భక్తులు మరణించారు. ఆయన తరుపు న్యాయవాది ఏపీ సింగ్ దీని గురించి మీడియాతో మాట్లాడారు.
తొక్కిసలాట జరగడానికి కొందరు కుట్రదా రులు ప్లాన్ చేశారని ఆరోపించారు. హృదయ విదా రకమైన సంఘటన జరిగింది. కుట్రలో 15 నుంచి 16 మంది పాల్గొన్నారు. గుర్తుతెలియని కొన్ని వాహనాలు తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్నాయి అని అన్నారు. 10 నుంచి 12 మంది వ్యక్తులు భక్తులపై విషం చిమ్మారని లాయర్ ఏపీ సింగ్ ఆరోపించారు. మహిళలు పడిపోయారని, ఊపిరి ఆడక చాలామంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భోలే బాబాపై కేసు నమోదు కావడంపై న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. తన క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com