Corona : కరోనా కలకలం .. 24 గంటల్లో 564 కొత్త కేసులు

దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో ప్రభలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 564 కొత్త కేసులు నమోదు కాగా, కరోనాతో ఏడుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో 5 నెలల చిన్నారి కూడా ఉన్నారు. మే 22న 257గా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,866కు చేరుకుంది. కొత్త వేరియంట్ ప్రవేశం తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న కేరళలో గడిచిన 24 గంటల్లో 114 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా పశ్చిమ బెంగాల్లో 106, కర్ణాటకలో 112, ఢిల్లీలో 105, గుజరాత్లో 47, మహారాష్ట్రలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రం గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు నమోదు కాకపోగా, ఇప్పటికే నమోదైన కేసుల్లో మూడు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ కారణంగ నమోదైన ఏడు మరణాల్లో మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకలో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో ఏపీలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉండగా, ఏపీలో ఆ సంఖ్య 50గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com