Election Count : ఎన్నికల కౌంటింగ్ షెడ్యూల్‌ను మార్చిన ఈసీ

Election Count : ఎన్నికల కౌంటింగ్ షెడ్యూల్‌ను మార్చిన ఈసీ

అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం జూన్ 4 నుంచి జూన్ 2 వరకు మార్చింది. లోక్‌సభ ఎన్నికల ఓట్లతో పాటు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించాలని ఈసీ గతంలో ప్రకటించింది. అయితే జూన్ 2వ తేదీతో రెండు అసెంబ్లీల గడువు ముగియనున్నందున, ఆ తేదీని వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది.

"అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం పార్లమెంటు నియోజకవర్గాల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు ఉండదు" అని పేర్కొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story