EC Serious : ప్రధాని మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ సీరియస్

EC Serious : ప్రధాని మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ సీరియస్

కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా మందలించింది. కులం, వర్గం, మతం ప్రస్తావనలు తీసుకొచ్చి ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపైనా అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం పేరుతో అలాంటి ప్రసంగాలపై సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకి మార్గదర్శకాలు జారీ చేసింది.

మత సహనాన్ని దెబ్బతీసే విధంగా ఎన్నికల ప్రక్రియను తక్కువ చేసేలా ప్రసంగాలు ఇవ్వడం మంచిది కాదని వెల్లడించింది. ప్రసంగాల్లో హుందాతనం పాటించాలని ఈసీ వారికి సూచించింది.

Tags

Next Story