ED : కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ రూ.70వేల నగదును గుర్తించి, తిరిగి ఇచ్చింది: ఆప్

ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన సోదాల్లో రూ.70,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న నగదును దర్యాప్తు సంస్థ తిరిగి ఇచ్చిందని భరద్వాజ్ చెప్పారు.
"ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు జరిగాయి. వారు కేవలం రూ. 70,000 నగదును మాత్రమే కనుగొన్నారు. ఆ తర్వాత వారు దాన్ని తిరిగి ఇచ్చారు. వారు ముఖ్యమంత్రి మొబైల్ను తీసుకొని అరెస్టు చేశారు. వారి వద్ద ఎటువంటి రుజువులు, ఆధారాలు గానీ, డబ్బు జాడ లేదు" అని ఆయన విలేకరులతో అన్నారు. కేజ్రీవాల్ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడి అరెస్ట్ చేశారని భరద్వాజ్ ఆరోపించారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ అరెస్టును ప్రస్తావిస్తూ, "ఈ రోజు, అతను కేజ్రీవాల్ను ఏజెన్సీల ద్వారా అరెస్టు చేపించారు. అతన్ని అడ్డుకునేవారు లేరు. వారు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేశారు. బహుశా వారు మరింత మందిని అరెస్టు చేయవచ్చు," అని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ అరెస్టును ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.
ఆప్ జాతీయ కన్వీనర్కు ఈడీ ఎలాంటి బలవంతపు చర్య నుండి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల తర్వాత, సిట్టింగ్ ముఖ్యమంత్రిలో మొదటి వ్యక్తి అయిన కేజ్రీవాల్ అరెస్టు జరిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన తొమ్మిది సమన్లను ముఖ్యమంత్రి దాటవేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com