Punjab : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి

X
By - Manikanta |11 March 2024 10:59 AM IST
పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్కు (Manpreet Singh Badal) గుండెపోటు వచ్చినట్లు అధికారులు మార్చి 10న తెలిపారు. దీంతో ఆయనను భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్లో చేర్చారు. బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బీజేపీ నాయకుడు బాదల్ జనవరి 2023లో కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి మారారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్ఏడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాదల్ చాలాసార్లు పార్టీ మారారు. ఆయన శిరోమణి అకాలీదళ్ (SAD)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. కానీ 2011లో తన రాజకీయ పార్టీ - పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ (PPP)ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com