సౌదీలో రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రా ఎన్నారై కుటుంబం

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రా ఎన్నారై కుటుంబం
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన ఎన్నారై కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు.

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన ఎన్నారై కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎన్నారై కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఉమ్రా నిర్వహించి కువైట్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలోని రియాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మరణించారు.

శ్రీ అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారులో భార్య తబారక్ సర్వర్ మరియు ఇద్దరు కుమారులు - మూడేళ్ల ఇహాన్, ఎనిమిది నెలల దమీల్‌తో సహా అతని కుటుంబంతో కలిసి ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు వచ్చారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి, ప్రార్థనలు చేసి తిరిగి కువైట్‌కు వస్తున్నారు. రియాద్‌లోని 120 కిలోమీటర్ల సమీపంలో హఫ్నా-తువాఖ్ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతదేహాలను రుమా జనరల్ ఆసుపత్రికి తరలించారు. చట్టపరమైన ఫార్మాలిటీలు ఇంకా పూర్తి కాలేదు. ఈ దుర్ఘటన గురించి విని షాక్‌కు గురైన గౌస్‌ బాషా తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. కుటుంబసభ్యులు వీరిని బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు.

డివైడర్ ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణ పత్రాలతో సహా చాలా వరకు సామాన్లు కాలిపోవడంతో బాధితులను గుర్తించడం కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్ KMCC మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ వివరాలను తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story