Seized Cars : రూ.60 కోట్లకు పైగా విలువైన కార్లను సీజ్ చేసిన ఐటీ శాఖ
ఢిల్లీలోని (Delhi) ఓ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ లగ్జరీ కార్లను గుర్తించింది. ఈ సోదాల్లో రూ.60 కోట్ల విలువైన విలాసవంతమైన కార్లు, రూ.16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్, ఫాంటమ్ కార్లు దొరికాయి. వీటితో పాటు ఇతర లగ్జరీ బ్రాండ్ కార్లలో మెక్లారెన్, లంబోర్ఘిని ఫెరారీ, రోల్స్ రాయిస్ ఉన్నాయి. కాన్పూర్, ఢిల్లీ, ముంబై, గుజరాత్ సహా 20 ప్రైవేట్ కంపెనీ చోట్ల దాడులు నిర్వహించారు.
పలు నివేదికల ప్రకారం, 'బన్షీధర్ టొబాకో కంపెనీ' యజమాని కుమారుడు శివమ్ మిశ్రా నివాసంలో కార్లు కనుగొన్నారు. దీంతో పాటు రూ.4.5 కోట్ల నగదు, పత్రాలను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. పలు వర్గాల సమాచారం ప్రకారం, పొగాకు కంపెనీ ఖాతాలలో చూపిన కంపెనీకి నకిలీ చెక్కులను జారీ చేస్తోంది. కాన్పూర్, ఢిల్లీలోని వ్యాపారవేత్త బంగ్లాపై కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com