Narendra Modi : ప్రధాని మోదీకి ఇటలీ అధ్యక్షురాలు అభినందనలు

Narendra Modi : ప్రధాని మోదీకి ఇటలీ అధ్యక్షురాలు అభినందనలు
X

NDA కూటమి గెలుపొందడంపై ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోనీ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో NDA 293 సీట్లతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. వారణాసి నుంచి బరిలోకి దిగిన ప్రధాని మోదీ 1.52లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కోటీశ్వరుల హవా కొనసాగింది. దేశవ్యాప్తంగా 2,573 మంది కోటీశ్వరులు బరిలో నిలవగా 503 మంది ఎంపీలుగా గెలుపొందారు. 4,013 మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేయగా వారిలో 391 మంది విజయం సాధించారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 1643 మందిపై పలు కేసులు ఉండగా వారిలో 250 మంది ఎంపీలుగా గెలిచారు. ఇక 324 మంది సిట్టింగ్ ఎంపీలు మరోసారి పోటీ చేయగా 213 మంది గెలుపొందారు.

Tags

Next Story