Karnataka CM : టికెట్ల కేటాయింపు వంశపారంపర్యం కాదంటూ కన్నడ సీఎం హాట్ కామెంట్

Karnataka CM : టికెట్ల కేటాయింపు వంశపారంపర్యం కాదంటూ కన్నడ సీఎం హాట్ కామెంట్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచారు. రాజకీయాల్లో వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాలు, టికెట్ల కేటాయింపుకు వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రీసెంట్ గా వెల్లడించారు. ఇందులో.. ఖర్గే అల్లుడు రాధాకృష్ణతో పాటు, ఐదుగురు మంత్రుల పిల్లలను కర్ణాటక నుంచి పోటీలో ఉంచారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

రాజకీయం వంశపారంపర్యం చేస్తున్నారనీ.. కాంగ్రెస్‌లో మొదట్నుంచి ఇదే ఆనవాయితీ వస్తోందని ఇతర పార్టీలు వేలెత్తిచూపిస్తున్నాయి. మంత్రుల పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వడం వంశపారంపర్య రాజకీయం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓటర్ల సిఫార్సుల అంగీకారం కూడా అభ్యర్థులను ఎంచుకోవడానికి, వారికి టికెట్లు కేటాయించడానికి కారణం అవుతాయని తెలిపారు సిద్ధరామయ్య.

కాంగ్రెస్ అభ్యర్థులను నియోజకవర్గ ప్రజల సిఫార్సు మేరకే హైకమాండ్ ఎంపిక చేసిందని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ కనీసం 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ కర్ణాటకలోనే 28 సీట్లు సాధిస్తామని పిచ్చిగా మాట్లాడుతోందనీ.. వారిలా తాము అబద్ధాలు చెప్పబోము అంటూ విమర్శలు చేశారు. ఇక బీజేపీ కర్ణాటకలో అన్ని సీట్లు సాధించలేదని చెప్పారు. వంశపారంపర్యంగా టికెట్లు కేటాయింపుపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story