Maoists : మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా దళాల కూంబింగ్

Maoists : మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా దళాల కూంబింగ్
X

చత్తీస్ గఢ్- తెలంగాణ బోర్డర్ లో మావోయిస్టుల కోసం భద్రతాబలగాల వెదుకులాట కొనసాగుతోంది. దండకారణ్యాల్లో ఎక్కడో ఒకచోటు కాల్పుల మోతలు మోగుతూనే ఉన్నాయి. ఇవాళ అబూజ్‌మడ్ అడవుల్లో తెలుగు మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా దళాలు కాల్పులతో కూబింగ్ చేపట్టాయి. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు.

మంచిర్యాలకు చెందిన రవి అలియాస్‌ వినయ్‌ , చీరాల నర్సయ్య, తిక్క సుష్మిత అనే ముగ్గురు మరణించారు. రవిపై రూ. 8 లక్షల రివార్డు, గోపన్న అలియాస్ చీమల నర్సయ్యపై రూ.25 లక్షల రివార్డ్, తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డుల ఉన్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా అబూజ్‌మడ్ అరణ్యంలో కాల్పుల మోత మోగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్నికల టైంలోనూ భద్రతాబలగాలు నిర్విరామంగా మావోయిస్టులను సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంచే వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి.

Tags

Next Story