Sonia Gandhi : సోనియా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా భేటీ

Sonia Gandhi : సోనియా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా భేటీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను సోమవారం కలిశారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా ఆదివారం జరిగిన ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, గాంధీ కుటుంబానికి మధ్య ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇందిరా గాంధీ ముఖ్యపాత్ర పోషించారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ను విముక్తి చేశారు. ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. ఇందిరా గాంధీ కుటుంబం, షేక్ హసీనా కుటుంబంతోపాటు.. భారత్, బంగ్లాదేశ్ మధ్య మితృత్వం కొనసాగుతోంది.

Tags

Next Story