EPF Account Holders : ఈపీఎఫ్ ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

EPF Account Holders : ఈపీఎఫ్ ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్
X

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ అకౌంట్లోని ఫండ్స్ పై తాజా వడ్డీ రేట్ల మేరకు రిటర్న్స్ అందుకుంటున్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజెషన్, రివైజ్డ్ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే అవుట్ గోయింగ్ సభ్యులకు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్ మెంట్స్ లో కొత్త వడ్డీలు వర్తింపజేసి నట్లు ప్రకటించింది. పదవీ విరమణ చేస్తున్న ఈపీఎఫ్ సభ్యులు వారి పీఎఫ్ సెటిల్ మెంట్స్ తో పాటు వడ్డీని పొందుతున్నారు.

మరి ఈ వడ్డీ చెల్లింపులు యాక్టివ్ మెంబర్స్కు ఎప్పు డు అందుతాయి. అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకో వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం 2023- 2024 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25శాతంగా నిర్ణయిం చింది. 2024 మే 31న కొత్త రేటు ను ప్రకటించింది. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇక ప్రతి త్రైమా సికంలో వెల్లడించమని.. వార్షిక రేటును ఆర్ధిక సంవత్సరం ముగిసిన తర్వాత సాధారణంగా తర్వాత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తామని తెలిపింది.

దీనికి సంబంధించి ఈపీఎఫ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో గతంలో ఓ పోస్టు చేసింది. అందులో ఈపీఎఫ్ సభ్యుల వడ్డీ రేటు క్వార్టర్లీ డిక్లేర్ చేయము. వచ్చే ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్ధిక సంవత్సరం ముగిసిన తర్వాత వార్షిక వడ్డీ రేటు ప్రకటిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటును భారత ప్రభుత్వం ఆమోదించింది.

Tags

Next Story