PM Modi : మోదీకి నవాజ్ షరీఫ్ ఇంట్రస్టింగ్ విష్

PM Modi : మోదీకి నవాజ్ షరీఫ్ ఇంట్రస్టింగ్ విష్

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి ( Narendra Modi ) దాయాది దేశం పాకిస్థాన్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వానికి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం అని మోదీకి పంపిన అభినందన సందేశంలో నవాజ్ షరీఫ్ అభిలషించారు.

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే 'ఎక్స్'లో నవాజ్ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. "మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీనా ఆత్మీయ అభినందనలు. మీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబించేలా మీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ద్వేషం స్థానే ఆశావహ దృక్పథం చోటుచేసుకుంటుందని ఆశిస్తున్నాను" అని షరీఫ్ పెట్టారు.

మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అభినందనలు తెలిపారు. ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన మాల్దీ వులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారి షస్, నేపాల్ దేశాలకు ఆహ్వానాలు పంపింది భారత్. ఇస్లామాబాద్ కు భారత ప్రభుత్వం ఈసారి ఆహ్వానం పంపలేదు. 2014లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రధానిగా స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా హాజరయ్యారు.

Tags

Next Story