National Highways : నేషనల్ హైవేల మానిటైజేషన్.. కేంద్రానికి డబ్బే డబ్బు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్ల మానిటైజేషన్ ద్వారా 60,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో మానిటైజేషన్ కోసం దేశంలోని 33 రోడ్ అసెట్స్ జాబితాను ఎనోచ్ఎఐ విడుదల చేసింది. టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానంతో పాటు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ కు ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ నిధులను సమీకరించాలని నిర్ణయించింది.
మానిటైజ్ చేయడం అంటే ఆయా రోడ్లను ప్రైవేట్ పరం చేయడమే. ఇలా మాని టైజ్ చేసిన రోడ్లపై వీటిని తీసుకున్న సంస్థలు టోల్ ఫీ వసూలు చేస్తాయి. వీటి వెంట అనేక ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. మానిటైజేషన్ చేసే జాతీయ రహదా 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 2,750 కిలోమీటర్ల ఉన్న ఈ రహదారులపై టోల్ ఫీజు రూపంలో సంవత్సరానికి 41 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ 33 జాతీయ రహదారుల ఆస్తులను విక్రయించడం, తనఖా పెట్టడం ద్వారా 53,000 నుంచి 60,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నేషనల్ - మానిటైజేషన్ పైపులైన్ (ఎన్ఎంపీ) కింద రహదారుల రంగంలో మానిటైజేషన్ ద్వారా 1.6 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. 2022 నుంచి 2025 వరకు మానిటైజేషన్లో ఇది 27 శాతం. ప్రస్తుతం మానిటైజేషన్ కు ఎంపిక చేసిన 33 రహదారులు నుంచి 53 నుంచి 60 వేల కోట్లు వస్తే ఈ లక్ష్యంలో ఇది 65 నుంచి 71 శాతంగా ఉంటుందని ఇక్రా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ నిర్మించిన జాతీయ రహదారులను మానిటైజ్ చేయడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. మరికొన్నింటిని అమ్ముతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com