NEET Paper Leak : నీట్ పేపర్ ఆన్ లైన్ లో వైరల్ కాలేదు – సీబీఐ అఫిడవిట్

దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంపై గురువారం సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్ విస్తృతస్థాయిలో జరగలేదని, ఒక ప్రాంతానికే పరిమితమని దర్యాప్తు సంస్థ తన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది బిహార్లో ఒక పరీక్ష కేంద్రంలో మాత్రమే పేపర్ లీక్ జరిగిందని, అది కొద్దిమంది విద్యార్థులపై మాత్రమే ప్రభావం చూపిందని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లీకైన పేపర్ ఆన్లైన్లో వైరల్ కాలేదని తన రిపోర్టులో సీబీఐ ప్రస్తావించినట్లు సమాచారం. నీట్ ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికి, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కేంద్రప్రభుత్వం సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com