PM Kisan : పీఎం కిసాన్ .. రేపు అకౌంట్లోకి డబ్బులు

PM Kisan : పీఎం కిసాన్ ..  రేపు అకౌంట్లోకి డబ్బులు
X

పీఎం కిసాన్ పథకం ( PM Kisan Scheme ) కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ ( PM Modi ) సంతకం చేశారు.

'మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. గత హయాంలో కూడా రైతుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యక.. మొదటి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపైనే చేశారు. ' అని తెలిపారు చౌహాన్.

ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 17వ విడత కింద 9.3 కోట్ల మంది అర్హులైన వారి కోసం రూ. 20 వేల కోట్ల మేర విడుదల చేయనుంది.

Tags

Next Story