Rajnath Singh : తొలిసారి వర్క్ ఫ్రం జైల్ వింటున్నా.. రాజ్ నాథ్ సెటైర్లు

Rajnath Singh : తొలిసారి వర్క్ ఫ్రం జైల్ వింటున్నా.. రాజ్ నాథ్ సెటైర్లు
X

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు చేశారు. ఫతీఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆప్ అధికార పార్టీ, అది ఎలాంటి పని చేస్తుందో మీకు పెద్దగా చెప్పనవసరం లేదని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే పార్టీ ప్రభుత్వం ఉందని, కానీ మద్యం కుంభకోణంలో ఒక నాయకుడు జైలు పాలయ్యాడని సీఎం అరవింద్ కేజ్రివాల్ గురించి చెప్పారు.

ఒక వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే తన పదవికి రాజీనామా చేసే నైతిక ధైర్యం, ప్రతీ నాయకుడికి ఉండాలని తాను భావిస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మద్యం కుంభకోణంలో కేజ్రివాల్ జైలు పాలయ్యాడని, అక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తానని చెప్పాడని, మనందరికి వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తెలుసని, కానీ తొలిసారి వర్క్ ఫ్రండ్ జైల్ గురించి వింటున్నానని సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ అవినీతిపై అన్నాహజారేతో కలిసి కేజ్రివాల్ ఉద్యమం చేసిన సమయంలో, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హజారే సూచించినప్పటికీ, కేజీవాల్ తన గురువు మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించారని అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసాన్ని 'శీష్ మహల్'గా మార్చి కోట్లాది ప్రజాధనాన్ని వినియోగించు కున్నాడని రాజ్నాథ్ ఆరోపించారు.

Tags

Next Story