Delhi : ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు.. 2 నెలల్లో 30 మంది మృతి

Delhi : ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు.. 2 నెలల్లో 30 మంది మృతి

దేశ రాజధానిలో ఘోరం జరిగింది. ఢిల్లీలోని (Delhi) అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అతడు గాయపడ్డారు.

ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిందన్నారు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి. తమకు కాల్ రాగానే 22 ఫైర్‌ టెండర్లను సర్వీస్ లో ఉంచామని తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫ్యాక్టరీ నుండి భారీ మంటలు రావడం, పొగ మేఘాలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. పేలుడు కారణంగా సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. గాయపడిన వారిలో కొందరు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. జనవరి 26న ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది నెలల చిన్నారి సహా నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించారు. జనవరి 18న వాయువ్య ఢిల్లీలోని పితంపురాలోని భారీ అపార్టుమెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. రాజధానిలో ప్రమాదాలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది.

Tags

Next Story