Rajasthan : రాజస్థాన్లో అరుదైన ఘటన .. నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

రాజస్థాన్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జోధ్పూర్కు చెందిన తుల్చా కన్వర్ అనే 28 ఏళ్ల మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆమె నాలుగు నిమిషాల్లో నలుగురికి జన్మనిచ్చింది.ఒక బిడ్డ ఉదయం 10.55 గంటలకు, రెండవ బిడ్డ రాత్రి 10.56 గంటలకు, మూడవ బిడ్డ రాత్రి 10.58 గంటలకు, నాల్గవ బిడ్డ ఉదయం 10.56 గంటలకు జన్మనిచ్చింది.
నలుగురు చిన్నారులు, మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తుల్చా కన్వర్ కు ఇది మూడో డెలివరీ. మొదటి రెండు ప్రసవాల్లోనూ ఆమె పిల్లలు చనిపోయారు. అందుకే కుటుంబ సభ్యులు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు.
ఉదయం 10.55 గంటల నుంచి నిమిషం తేడాతో పిల్లలందరూ జన్మించినట్లు తెలిపారు. అయితే వారు కొద్దిగా బరువు తక్కువ ఉండటంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో జోధ్పూర్ మహిళ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com