Sonia Gandhi : అధికారమిస్తే దేశ మహిళల జీవితాలు మార్చేస్తామన్న సోనియా

Sonia Gandhi : అధికారమిస్తే దేశ మహిళల జీవితాలు మార్చేస్తామన్న సోనియా
X

కాంగ్రెస్ గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందని వీడియో సందేశం పంపించారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ. తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలిపారు.

దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం కల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల వేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహా లక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరు తుందని తెలిపారు. "స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని నేటి ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేనిది. కానీ, ద్రవ్యోల్బణం వల్ల నేను వారు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వారి కష్టానికి న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ విప్లవాత్మక గ్యారంటీతో ముందుకొచ్చింది. మహాలక్ష్మి పథకంలో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తాయి" అని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తాము అమలు చేస్తున్న గ్యారెంటీల పల్ల అనేక కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సోనియా చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్రం, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు.

Tags

Next Story