Supreme Court : ఎల్ అండ్ టీ కంపెనీకి భారీ ఊరట

ఎల్ అండ్ టీ కంపెనీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రెండు భారీ ప్రాజె క్టుల టెండర్లను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మొత్తం రూ. 14 వేల కోట్లతో రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టాలని మహారాష్ట్ర నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.8 వేల కోట్లతో థానే-గోడ్బందర్ నుంచి, భయాందర్ వరకు టన్నెల్ నిర్మాణం, అదే విధంగా రూ.6 వేల కోట్లతో ఎలవేటెడ్ రోడ్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ముంబై మెట్రోపాలిటనీ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లు పిలిచింది. టెండర్ ప్రక్రియతో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎల్ అండ్ టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇవాళ విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మసీహ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పారదర్శత కోసం టెండర్లకు ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com