Bhatti Vikramarka : పంజాబ్ ఎలక్షన్ ప్రచారంలో భట్టి విక్రమార్క

X
By - Manikanta |23 May 2024 12:29 PM IST
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పంజాబ్ లో కాంగ్రెస్ ప్రచారానికి వెల్లనున్నారు. ఫరీద్ కోటలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ ఈ మేరకు ఓ ప్రకటన జారీచేసింది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎఐసీసీ ఆయనను ఫరీద్ కోట్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది.
బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రానికి ఫరీద్ కోట్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి పార్టీ లోక్ సభ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తారు. ఇంతకు ముందు పార్టీ తరపున కేరళ, ఓడిషా, రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భట్టి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com