PM Modi : నారిమన్ మృతి పట్ల మోదీ సంతాపం

95 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో (New Delhi) తుది శ్వాస విడిచిన ప్రముఖ న్యాయ వేత్త ఫాలి ఎస్. నారిమన్ (S Nariman)మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతాపం వ్యక్తం చేశారు." శ్రీ ఫాలీ నారిమన్ జీ అత్యంత విశిష్టమైన న్యాయవాది. మేధావులలో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన జీవితం అంకితం చేశారు. ఆయన మరణం నన్ను చాలా బాధ పెడుతోంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని పీఎం ఎక్స్లో రాశారు.
ప్రముఖ రాజ్యాంగ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారిమన్ (95) న్యూఢిల్లీలో కన్నుమూశారు. న్యాయవాద రంగంలో మహోన్నత వ్యక్తి అయిన నారిమన్, న్యాయ వారసత్వాన్ని వదిలిపెట్టి తుది శ్వాస విడిచారు. నారిమన్ భారతీయ న్యాయ శాస్త్రానికి గణనీయమైన కృషి చేశారు. మే 1972లో భారత అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. జనవరి 1991లో అతనికి పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్తో సహా పలు అవార్డులతో గుర్తింపు పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com