Ind vs Eng : నాలుగో టెస్టుకు బుమ్రా దూరం!

Ind vs Eng : నాలుగో టెస్టుకు బుమ్రా దూరం!

ఇంగ్లాండ్ (England) తో జరుగుతున్న ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలోకి వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. దీంతో రేపు భారత జట్టు రాంచీకి చేరుకొని ఎల్లుండి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది. అయితే ఈ టెస్టుకు టీమిండియా పేసర్ జస్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.

వర్క్డ్ కారణంగా బుమ్రాకు (Bumrah) నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడించకుండా మరో పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చింది జట్టు యాజమాన్యం. ఈ నేపథ్యంలో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న బుమ్రాకు సైతం పనిభారం దృష్ట్యా రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తోంది.

ఐదో టెస్టుకు కూడా బుమ్రా ఆడటం అనుమానంగానే ఉంది. కాగా ఈ సిరీస్ లో బూమ్రా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆడిన మూడు టెస్టుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా బుమ్రానే. ఒకవేళ బుమ్రా నిజంగానే నాలుగో టెస్టుకు దూరమైతే అతని స్థానంలో ముఖేష్ కుమార్ లేదా నాలుగో స్పిన్నర్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story