IPL 2024 : దంచి కొట్టిన బట్లర్.. ధోని, కోహ్లీనే స్ఫూర్తి అంటూ మెస్మరైజ్

IPL 2024 : దంచి కొట్టిన బట్లర్.. ధోని, కోహ్లీనే స్ఫూర్తి అంటూ మెస్మరైజ్

ఈ ఏడాది ఐపీఎల్ ను చూస్తూ పీక్స్ లో ఆనందం పొందుతున్నారు క్రికెట్ అభిమానులు. ఒకటే కొట్టుడు.. కొట్టుడే కొట్టుడు. ప్రతి మ్యాచ్ ఓ హైలైట్ క్లైమాక్స్ అన్నట్టుగా సాగుతోంది. హైలైట్స్ చూస్తున్నామా అన్నంతగా రెచ్చిపోయి ఆడుతున్నారు ఆటగాళ్లు.

ఏప్రిల్ 16 రాత్రి కోల్‌కతాతో రాజస్థాన్ మ్యాచ్ ఓ అద్భుతమైన ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఓడిపోతుంది అనుకున్న రాజస్థాన్.. చివరి నిమిషంలో కళ్లుచెదిరే విజయం సాధించింది. చివరి వరకు ఆత్మవిశ్వాసంతో ఓ యుధుడిలా ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్ కు విజయాన్ని సంపాదించి పెట్టాడు జోస్ బట్లర్. బట్లర్ 60 బాల్స్ లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 రన్స్ బాదాడు.

మ్యాచ్ తర్వాత ప్రైజింగ్ సెర్మనీలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు బట్లర్. ఈ ఇన్నింగ్స్ తనకు హ్యాపీగా ఉందన్నాడు బట్లర్. పైట్ చేయకుండా వికెట్ ఇవ్వడం నచ్చలేదన్నాడు. టీం ఇండియా ప్లేయర్స్ ధోనీ, కోహ్లీ మ్యాచ్ ఓడిపోయే స్థితిలో లాస్ట్ మినిట్ వరకు కాన్ఫిడెన్స్ తో ఆడతారని.. వాళ్ల స్ఫూర్తితోనే తాను కూడా లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపించానని బట్లర్ అన్నాడు. గతంలో కుమార సంగక్కర కూడా ఇలాగే ఎంకరేజ్ చేసేవాడని చెప్పాడు. ఇప్పుడు బట్లర్ పేరు మార్మోగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story