IPL 2024 : ధోనీ అంటే అదీ.. ఆడింది 4 బాల్సే.. ఐనా విధ్వంసం

IPL 2024 : ధోనీ అంటే అదీ.. ఆడింది 4 బాల్సే.. ఐనా విధ్వంసం

మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులు ఎందుకు అంతగా పడిచస్తారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఆదివారం ముంబై వాఖండే స్టేడియంలో ముంబై మ్యాచ్ లో ధోనీ మ్యాజిక్ చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ చేస్తున్నాడు. అది చెన్నై ఇన్నింగ్స్ లో చివరి ఓవర్. మిషెల్ ఔట్ కావడంతో.. ధోనీ క్రీజులోకి వచ్చాడు. స్టేడియంలో అరుపులే అరుపులు.

నాలుగు బంతులే మిగిలి ఉన్నా కూడా ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు చాలు అని చెన్నై అభిమానులు కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్ జోష్ తో వెల్కమ్ చెప్పారు కాబట్టి.. వాళ్లను అదే స్థాయిలో అలరించాడు ధోనీ.

హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ని పిండి పిండి చేసి..ముంబై ఫ్యాన్స్ కు మరోసారి చిర్రెత్తేలా చేశాడు. ధోనీ 4 బాల్స్ లో 20 రన్స్ చేయడంతో.. చెన్నై స్కోరు 200 క్రాస్ అయింది. ధోనీ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది అని చెప్పొచ్చు. అద్భుతమైన ఫిట్ నెస్ తో ఫీల్డ్ లోనూ ఫ్యాన్స్ ను అలరించాడు ధోనీ.

Tags

Read MoreRead Less
Next Story