ICC Chairman : ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జైషా

ICC Chairman : ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జైషా
X

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జైషా తెలిపారు. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై దృష్టి సారిస్తానని, మహిళల క్రికెట్‌ను డెవలప్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఆయన బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా కావడం విశేషం. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా(36) గుర్తింపు దక్కించుకున్నారు. చివరగా భారత్‌ నుంచి శశాంక్‌ మనోహర్‌ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నారు.

Tags

Next Story