IPL 2024 : ముంబై ఔట్.. టాప్ 3కి దూసుకొచ్చిన లక్నో
By - Manikanta |1 May 2024 7:29 AM GMT
ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ లో విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ 3లోకి వెళ్లింది. ముంబై ఇండియన్స్ దాదాపు ఇంటిదారి పట్టడం ఖాయమైంది.
లక్నో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో ముంబై ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. లక్నో నాలుగు వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో నాలుగు వికెట్ల తేడాతో ముంబైని ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. చెన్నై నాలుగో స్థానానికి పడిపోయింది. ముంబై ఆరు పాయింట్లు నెట్ రన్ రేట్ -0.272తో తొమ్మిదో స్థానంలోకి వెళ్లింది. MIకి ఇది ఏడో ఓటమి. ముంబై నెక్స్ట్ లెవెల్ రేసులోకి వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com