Mohammad Shami : సక్సెస్ అయిన షమీ సర్జరీ.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

Mohammad Shami : గాయం కారణంగా ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 నుండి ఆటకు దూరంగా ఉన్న భారత పేసర్ మహమ్మద్ షమీ.. తనకు లండన్లో (London) శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫొటోలను కూడా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని షమీ చెప్పాడు. తాను మళ్లీ తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నుంచి షమీ మైదానానికి దూరంగా ఉన్నాడు. మొదటి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అతను ఫిట్ అవుతాడని భావించారు. కానీ అది జరగలేదు. ఇదిలా ఉండగా మహ్మద్ షమీ గతేడాది వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
మోదీ ట్వీట్
ఇక గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్విట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com