IPL 2024 : చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

IPL 2024 : చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

గుజరాత్‌తో మ్యాచులో ఆర్సీబీ సంచలనం సృష్టించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023లో ఆర్సీబీపై ముంబై 21 బంతులు మిగిలి ఉండగానే 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. అత్యధిక సార్లు 500కుపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 7 సీజన్లలో 500కుపైగా పరుగులు బాదారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు సాధించారు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (7) రికార్డును ఆయన సమం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story