IND VS ENG : టీమిండియా 445 పరుగులకు ఆలౌట్

IND VS ENG :  టీమిండియా 445 పరుగులకు ఆలౌట్

భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445 పరుగులకు ఆలౌట్ అయింది. 326/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 119 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా సెంచరీ హీరోలుగా నిలువగా తొలిసారి బరిలో దిగిన బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, రూట్ తలో వికెట్ తీశారు.

ఇక తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఖాతా తెరవక ముందే 5 పరుగుల స్కోరు బోర్డుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అంతకుముందు ఇండియా ఇన్నింగ్స్ లో అశ్విన్ పిచ్ పై డేంజర్ జోన్ లో పరుగెత్తడంతో అంపైర్లు ఇండియాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో ఇంగ్లండ్ ఖాతా తెరవక ముందే ఆ టీమ్ కు 5 పరుగులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story