Ind vs SL :శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా షెడ్యూల్ ఖరారు

Ind vs SL :శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా షెడ్యూల్ ఖరారు
X

శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు లంకలో పర్యటించనుంది. జులై 27, 28, 30న టీ20 మ్యాచులు జరిగే అవకాశముంది. ఆగస్టు 2, 4, 7న వన్డేలు జరగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్‌ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.

జింబాబ్వే సిరీస్‌కు భారత జ‌ట్టు

శుభ్‌మ‌న్‌ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.

Tags

Next Story