IPL 2024 : అదరగొట్టిన తెలుగు ప్లేయర్ .. నితీశ్ రెడ్డి అరుదైన ఘనత
రాజస్థాన్ రాయల్స్ తో జరిగినమ్యాచ్లో అదరగొట్టిన తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి(42 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 76*) ఓ అరుదైన ఘనత సాధించారు. 20 ఏళ్లలోపు ఒక ఇన్నింగ్సులో అత్యధిక సిక్సులు(8) కొట్టిన రెండో ప్లేయర్గా నిలిచారు. 2017లో రిషభ్ పంత్ గుజరాత్ లయన్స్పై అత్యధికంగా 9 సిక్సర్లు బాదారు. అతనే 2018లో ఆర్సీబీ , హైదరాబాద్ లపై ఏడు సిక్సుల చొప్పున కొట్టారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్పై హైదరాబాద్ గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్(77), జైస్వాల్(67) అర్ధసెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com