Virat Kohli : విరాట్ కోహ్లీ మరో ఘనత.. 400 సిక్సులు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. పంజాబ్తో మ్యాచ్లో చెలరేగిన అతడు టీ20 క్రికెట్లో 400 సిక్సుల మార్కును అందుకున్నారు. ఆ మ్యాచ్లో 6 సిక్సులు బాదిన కోహ్లీ మొత్తంగా పొట్టి ఫార్మాట్లో 401 సిక్సులు కొట్టారు. అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్గా రోహిత్ శర్మ(506) మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 30 సిక్సులు కొట్టారు.
అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపు ఓటమిలు ఎలా ఉన్నప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పటిలాగానే తన ఆట తీరుతో జట్టును ఆదుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టును విజయతీరాలకు నడిపించడానికి కష్టపడుతున్నాడు.
కానీ అతనికి మిగతా ఆటగాళ్ళ నుంచి సరైన సహకారం అందకపోవడంతో చివరికి ఇక ఆర్సీబికి ఓటములు తప్పడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ ఐపీఎల్ టోర్నీలో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com