ISRO : గగన్ యాన్ కు సిద్దమవుతున్న ఇస్రో

భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర - గగన్ యాన్ చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. అంతా సవ్యంగా సాగితే 2026 చివరికల్లా ఈ మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. గగన్ యాన్ ప్రాజెక్ట్ 3 రోజుల మిషన్ నిమిత్తం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత్ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్తో వాటిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.
90 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ స్వదేశీ అంతరిక్ష ప్రాజెక్ట్ విజయవంతమైతే, సోవియట్ యూనియన్, అమెరికా, చైనా దేశాల తర్వాత మానవుడిని అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారతదేశం నిలుస్తుంది. ఐఐటీ- గౌహతిలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. గగనాన్ ప్రాజెక్టుపై గత నాలుగేళ్లుగా పనిచేస్తు న్నట్లు తెలిపారు. రాకెట్ పూర్తిగా సిద్ధంగా ఉన్నదని, షెడ్యూల్ చేయాలనుకున్నాం అయితే పలు సాంకేతిక కారణాల వల్ల కాస్త పొడిగించామని ఆయన వెల్లడించారు. 2026 చివరి నాటికి సిబ్బందితో కూడిన అంత రిక్ష యాత్రకు ముందు మరో మూడు ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com